సికింద్రాబాద్,వెలుగు: కరోనా తర్వాత తినే ఫుడ్ పై ప్రజల్లో మరింత శ్రద్ధ పెరిగింది. అయితే తినే పుడ్ లో ఏయే పదార్థాలు ఎంతెంత మోతాదులో పోషక విలువలు ఉన్నాయని తెలుసుకునేందుకు తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) జర్మనీ సైంటిస్టులతో కలిసి న్యూట్రీ ఎయిడ్ పేరుతో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించింది. దీన్ని గురువారం ఎన్ఐఎన్లో ఆవిష్కరించింది.
ఇది ఒక వినూత్నమైన, సమగ్ర మొబైల్ యాప్ కోసం రూపొందించిన అప్లికేషన్. మనం తినబోయే ఫుడ్ ను స్కాన్ చేయడం ద్వారా అందులోని పోషక విలువలు ఏ మేరకు ఉన్నాయనేది క్షణాల్లో తెలుసుకోవచ్చు. మనం ప్రతి రోజు తినే ఇడ్లీ, వడ, ఇతర అల్పహార పదార్థాలను ఒకసారి మన ఫోన్ఆన్చేసి యాప్తో స్కాన్చేస్తే క్షణాల్లో అందులోని పిండి పదార్థాలు, విటమిన్లు, ప్రోటీనులు, ఇతర పోషక పదార్థాలు ఎంతెంత మేరకు ఉన్నాయనే విషయాలను వాటి పర్సెంటేజీలను తెలియజేస్తుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు.
తార్నాక లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జర్మనీలోని ఆక్స్ బర్గ్యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్మార్కస్ , చండీఘర్కు చెందిన పలువురు ఫుడ్న్యూట్రీషన్ సైంటిస్టుల బృందం రెండేళ్ల పాటు శ్రమించి యాప్ను రూపొందించారు. ఇందుకు సుమారు 720 మంది ఆహారపు అలవాట్లు , ఇతర అంశాలను పరిశీలించారు.
