
నిర్మల్, వెలుగు: వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈమేరకు ఆమె మంగళవారం రాత్రి సోన్ మండలం కడ్తాల్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం సంచుల లోడింగ్, ధాన్యం తరలింపు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెందవద్దని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
బుధవారం సారంగాపూర్ మార్కెట్ యార్డు, మండలం జామ్, ధని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శిం చారు. ధాన్యం తూకం, లోడింగ్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి మండల కేంద్రంలో అదనంగా 20 మంది కూలీలను సమకూర్చుకొని కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామ
న్నారు. ధాన్యం కొనుగోళ్లలో అపోహలకు లోను కావద్దని, మొత్తం ధాన్యాన్ని కొంటామని స్పష్టం చేశారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, జిల్లా మేనేజర్ సుధాకర్, తహసీల్దార్ శ్రీదేవి పాల్గొన్నారు.