ఎకరాకు రూ.30వేల పరిహారం ఇవ్వాలి : ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి

ఎకరాకు రూ.30వేల పరిహారం ఇవ్వాలి : ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి

బచ్చన్నపేట, వెలుగు: తుఫాన్​వల్ల నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.30వేల చొప్పున  ఇవ్వాలని నిర్మల్​ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి రాష్ట్ర సర్కార్​ను డిమాండ్​ చేశారు. సోమవారం జనగామ జిల్లా  బచ్చన్నపేట మండలం పోచన్నపేట, నర్మెట్ట మండలం వెల్దెండ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. 

కాగా, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నారాణపూర్​కి చెందిన సీనియర్​ నాయకులు పరిదే భీమేశ్​ బీజేపీలో చేరాడు. ఆయన వెంట కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, జగన్​మోహన్​రెడ్డి,  బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్, నాయకులు తదితరులు  పాల్గొన్నారు.