నిర్మల్లో ఉద్రిక్తత.. ఏలేటి కాన్వాయ్పై బీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల రాళ్ల దాడి

నిర్మల్లో ఉద్రిక్తత.. ఏలేటి కాన్వాయ్పై బీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల రాళ్ల దాడి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రచార కాన్వాయ్ పై.. బీఆర్ఎస్, ఎంఐఎం వర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. బీఆర్ఎస్ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ అహ్మద్ తన అనుచరులతో కలిసి బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పరం తగాదాలు నెలకొన్నాయి. ఒకరిని ఒకరు తోసేసుకుంటూ.. రాళ్లు, పెద్దపెద్ద కర్రలతో కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వారి గొడవను సద్దుమణిగించారు.  
  
ఈ క్రమంలో వైయస్సార్ కాలనీలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.