మన్మోహన్ ప్రకటన తీసుకుంటాం : నిర్మలా సీతారామన్

మన్మోహన్ ప్రకటన తీసుకుంటాం : నిర్మలా సీతారామన్

దేశంలో ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు అన్ని వర్గాలతో సమావేశమవుతున్నానని చెప్పారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే పలు పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయ్యి.. వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్నామని చెప్పారు. పరిశ్రమ యాజమాన్యాలకు ఏం కావాలో… కేంద్రం నుంచి ఏం కోరుకుంటున్నాయో తెలుసుకుని.. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెండుసార్లు ఇండస్ట్రీస్ ప్రతినిధులతో మాట్లాడామన్నారు. ఇంకా మరిన్ని సంప్రదింపులు జరపాల్సి ఉందని నిర్మలా సీతారామన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

మన్మోహన్ సింగ్ చేసిన కామెంట్స్ పైనా నిర్మలా సీతారామన్ రెస్పాండ్ అయ్యారు. రాజకీయ ప్రతీకారం మాని.. విజ్ఞుల మాట వినాలని మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే అయితే… తాను ఈ విషయంలో ఆయన స్టేట్ మెంట్ కచ్చితంగా తీసుకుంటా అని చెప్పారు నిర్మలా సీతారామన్.