PBKS vs MI: ఓ వైపు కోపం.. మరోవైపు బాధ: ఓటమి తర్వాత తల పట్టుకొని తీవ్ర నిరాశలో నీతా అంబానీ

PBKS vs MI: ఓ వైపు కోపం.. మరోవైపు బాధ: ఓటమి తర్వాత తల పట్టుకొని తీవ్ర నిరాశలో నీతా అంబానీ

ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ కు పంజాబ్ కింగ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆదివారం (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై మొదట బ్యాటింగ్ చేసి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యం 204 పరుగులు కావడంతో విజయంపై ముంబై ధీమాగా ఉంది. ఆ జట్టు ఓనర్ నీతా అంబానీ జట్టు గెలుస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. ఊహించినట్టుగానే పంజాబ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది. 

ఛేజింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్  6 పరుగులకే ఔట్ కావడంతో పంజాబ్ ఆశలు సన్నగిల్లాయి. అయితే జోష్ ఇంగ్లిస్ బుమ్రా ఓవర్లో 20 పరుగులు బాదడంతో స్కోర్ వేగం అమాంతం దూసుకెళ్లింది. ఇంగ్లిష్ ఔటైన తర్వాత వధేరా, అయ్యర్ పంజాబ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ దశలో హార్దిక్ పాండ్య వేసిన బంతిని వధేరా ఫైన్ లెగ్ లో ఆడాడు. టైమింగ్ కుదరకపోవడంతో బౌండరీ దగ్గర ఉన్న బోల్ట్ దగ్గరకు క్యాచ్ వెళ్ళింది. అయితే బోల్ట్ క్యాచ్ మిస్ చేయడంతో వధేరా బతికిపోయాడు. ఈ దశలో నీతా అంబానీ చూపించిన రియాక్షన్స్ వైరల్ అవుతున్నాయి. 

60 ఏళ్ల అంబానీ తల వెనక్కి వంచి, కళ్ళు మూసుకుని, నుదిటిపై చేయి వేసుకుని కనిపించింది. మ్యాచ్ ఓడిపోవడంతో ఆమె షాక్ లో ఉంచి బయటకు రాలేకపోయింది. అంతేకాదు మ్యాచ్ చేజారుతున్న సమయంలో కోపంతో రగిలిపోయింది. ఛేజింగ్ సమయంలో నీతా అంబానీ ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా గెలుస్తుందన్న మ్యాచ్ లో ఓడిపోవడంతో ఆమె తీవ్ర నిరాశతో కృంగిపోయింది. గుజరాత్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత ఆరేళ్ళు చూపిస్తూ ఆరోసారి టైటిల్ కొడుతున్నామని సంకేతాలు ఇచ్చిన ఆమెకు పంజాబ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ALSO READ : MI vs PBKS: 19 నెంబర్ జెర్సీకి కన్ను కొట్టిన ప్రీతి జింటా.. ఇంతకీ అతను ఎవరో తెలుసా..?

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌‌‌‌–2లో పంజాబ్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. టాస్‌‌‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 203/6 స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌ 19 ఓవర్లలో 207/5 స్కోరు చేసి గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌‌‌‌ అయ్యర్ కు  ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌లతో 87 నాటౌట్‌‌‌‌) దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.