MI vs PBKS: 19 నెంబర్ జెర్సీకి కన్ను కొట్టిన ప్రీతి జింటా.. ఇంతకీ అతను ఎవరో తెలుసా..?

MI vs PBKS: 19 నెంబర్ జెర్సీకి కన్ను కొట్టిన ప్రీతి జింటా.. ఇంతకీ అతను ఎవరో తెలుసా..?

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా కన్ను కొట్టడం వైరల్ గా మారుతుంది. ఆదివారం (జూన్ 1) ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో విజయం సాధించి పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌లతో 87 నాటౌట్‌‌‌‌) దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ 11 ఏళ్ళ తర్వాత తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. దీంతో ఆ జట్టు ఆనందాలు అంబరాన్ని అంటాయి. 

ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా ఎప్పటిలాగే  ఎగిరి గంతేస్తూ తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. శ్రేయాస్ అయ్యర్ విన్నింగ్ రన్స్ కొట్టడంతో తన చేతులను ఊపుతూ స్టాండ్ లో నుంచి కిందకి దూకింది. ఆ తర్వాత ఆమె శ్రేయాస్ అయ్యర్‌కు హగ్ ఇచ్చింది. ఈ విజయం గురించి ఇద్దరూ మాట్లాడుకుంటుండగా ప్రధాన కోచ్ పాంటింగ్‌ను కౌగిలించుకుంది. ఇదిలా ఉంటే మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ సమయంలో ప్రీతి జింటా తన ఆటగాళ్ళలో ఒకరిని చూస్తూ కన్ను కొట్టింది. 2014 తర్వాత తమ జట్టు ఫైనల్ కు చేరుకోవడంతో ప్రీతి జింటా కన్ను కొట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.  

ALSO READ : Heinrich Klaasen: క్లాసన్ సంచలన నిర్ణయం.. రూ. 23 కోట్ల వీరుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్

పంజాబ్ కింగ్స్ జట్టులో ప్రీతీ జింటా ఎవరికీ కన్ను కొడుతుందో వెనక నుంచి కనపడలేదు. వెనక నుంచి మాత్రమే 19 నెంబర్ జెర్సీ కనిపించింది. పంజాబ్ కింగ్స్ లో 19 నెంబర్ జెర్సీ ధరించిన ఆటగాడు నేహాల్ వధేరా. వీడియోని గమనిస్తే వధేరాను చూసే ప్రీతి జింటా కన్ను కొట్టినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ మ్యాచ్ లో వధేరా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో కలిసి నాలుగో వికెట్ కు 86 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పోయి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్ 29 బంతుల్లో 4 ఫోర్లు.. 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌‌‌‌–2లో పంజాబ్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. టాస్‌‌‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 203/6 స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌ 19 ఓవర్లలో 207/5 స్కోరు చేసి గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌‌‌‌ అయ్యర్ కు  ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌లతో 87 నాటౌట్‌‌‌‌) దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.