
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. జులై 4న సినిమా విడుదల కానుంది. మంగళవారం ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు. అజనీష్ లోక్నాథ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సింహాచలం మన్నెల ఆకట్టుకునే లిరిక్స్ను అందించారు.
అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేస్తోంది. ‘భూ అంటూ భూతం వస్తే.. ఆగకే అమ్మాడీ.. ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి.. పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే.. పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే.. భయపడి అడుగు ఆపకే..’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తన మేనకోడలిని ఆడిస్తూ హీరో పాడే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఈ సాంగ్ విజువల్స్ ప్లెజెంట్గా ఉన్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ కూతురు బేబీ దిత్య చిన్నారి పాత్రలో ఆకట్టుకుంది.