నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ బషీర్ బాగ్ నిజాం కాలేజీ గర్ల్స్ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా హాస్టల్ లో నీటి సరఫరా లేదంటూ.. రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. కాలేజీ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవలే లక్ష రూపాయలు ఖర్చు చేసి మోటార్ రిపేర్ చేయించమని చెప్తున్నా.. నీటి సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. 

తమ సమస్య పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ విద్యర్థులు రోడ్డుపై భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.