వడ్ల కొనుగోళ్లలో స్టేట్​లోనే జిల్లా టాప్

వడ్ల కొనుగోళ్లలో స్టేట్​లోనే జిల్లా టాప్
  • కలెక్టర్​ను అభినందించిన సీఎం రేవంత్ 

నిజామాబాద్​, వెలుగు:  యాసంగి సీజన్​లో 8.19 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేసి స్టేట్​లో ఇందూర్​ జిల్లా టాప్​ స్థానంలో నిలబెట్టారని సీఎం రేవంత్​రెడ్డి కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతును అభినందించారు. మంగళవారం మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, సీతక్క తదితరులతో కలిసి  వీడియో కాన్ఫ​రెన్స్​ నిర్వహించిన సీఎం, కలెక్టర్​ ఆధ్వర్యంలోని ఆఫీసర్ల టీం అద్భుతంగా పనిచేసి రికార్డు సాధించారని కితాబునిచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.

ఇంకా 75 సెంటర్లు ఓపెన్..

గతేడాది యాసంగిలో 3.85 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేసిన తాము ఈ సీజన్​లో కొనుగోళ్లను 8.19 లక్షల టన్నులకు చేర్చామని కలెక్టర్ రాజీవ్​గాంధీ సీఎం రేవంత్​రెడ్డికి తెలిపారు. 700 పైగా ఓపెన్​ చేసిన కొనుగోలు సెంటర్లలో ఇంకా 75 నడుస్తున్నాయన్నారు. రైతులందరి నుంచి వడ్ల సేకరణ పూర్తయ్యాక వాటిని మూసేస్తామన్నారు. కొనుగోలు చేసిన దాంట్లో 93.24 వేల మెట్రిక్​ టన్నులు దొడ్డు రకం వడ్లు కాగా మిగితావన్నీ సన్నాలేనన్నారు. ఇప్పటి దాకా 1,00,535 రైతులకు రూ.1786.13 కోట్ల పేమెంట్స్​ చేశామని వివరించారు. అదనపు కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్​, డీఆర్డీవో సాయాగౌడ్​ తదితరులు ఉన్నారు. 

డ్రైనేజీలను పరిశీలించిన కలెక్టర్​

సిటీలోని డ్రైనేజీలను బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, నుడా చైర్మన్​ కేశవేణుతో కలిసి కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు పరిశీలించారు.  డ్రైనేజీ కెనాల్స్ వర్షాలకు పొంగకుండా జేసీబీలు వినియోగించి డీసిల్టింగ్​ చేయాలని సూచించారు. జేసీబీలు ఉపయోగించే వీలులేని చోట శానిటేషన్​ సిబ్బంది సేవలు తీసుకోవాలన్నారు. గతేడాది ఇబ్బంది కలిగిన ఏరియాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు.