
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో మాట్లాడారు. కల్లు కల్తీకి అల్ఫ్రాజోలం, క్లోరోఫాం, డైజోఫాం వినియోగించడం వల్ల నాడులపై ప్రభావం పడుతుందన్నారు. గర్భిణులు కల్తీ కల్లు తాగితే పుట్టే పిల్లలు అనారోగ్యంగా ఉంటారన్నారు. ఈ విషయాన్ని గ్రామాలు, స్కూల్స్, కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు.
డ్రగ్స్ పై టోల్ఫ్రీ1908 నంబర్కు సమాచారం ఇచ్చేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, డీఈవో అశోక్, డీఏవో వీరాస్వామి, ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్, డీటీవో ఉమా మహేశ్వర్రావు, జిల్లా డ్రగ్ కంట్రోలింగ్ ఆఫీసర్ శ్రీలత తదితరులు ఉన్నారు. ఈ మీటింగ్ తరువాత సీపీ సాయిచైతన్య జిల్లా పోలీస్ ఆఫీసర్స్తో డ్రగ్స్ కంట్రోకల్పై మరో మీటింగ్ నిర్వహించి సూచనలు ఇచ్చారు.
అర్హుల ఎంపికలో జాప్యం చేయొద్దు
బాల్కొండ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జాప్యం చేయొద్దని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీంగల్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులపై అధికారులతో సమీక్షించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇల్లు నిర్మించుకునే స్థోమత లేనివారికి మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రూ. లక్ష రుణం ఇచ్చేలా చొరవ చూపాలన్నారు.
నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమీక్షలో జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, భీంగల్ మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్, తహసీల్దార్ షబ్బీర్, అధికారులు పాల్గొన్నారు.