జ్వరాలు తగ్గేదాకా వైద్య శిబిరం .. కాల్పోల్ తండాను విజిట్ చేసిన  కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

జ్వరాలు తగ్గేదాకా వైద్య శిబిరం .. కాల్పోల్ తండాను విజిట్ చేసిన  కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : మోపాల్ మండలం కాల్పోల్​ తండాలో జ్వరాలు తగ్గే వరకు మెడికల్​ క్యాంప్​ కొనసాగించాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం తండాను విజిట్​ చేసి వీధులన్నీ తిరిగారు. మురుగు కాల్వలు క్లీన్ చేయించి దోమల నివారణ మందు పిచికారీ చేయాలన్నారు. పాత టైర్లలో నిలిచిన నీటిని తొలగించారు.  ప్రతి శుక్రవారం డ్రై డే  పాటించాలని డీపీవో శ్రీనివాస్​ను ఆదేశించారు. జ్వరపీడితులకు మెరుగైన వైద్యం అందించాలని మలేరియా ఆఫీసర్ డాక్టర్​ తుకారాంరాథోడ్​కు సూచించారు.

 సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. తండావాసులు ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. అయితే అధిక జ్వరంతో బాధపడుతూ నీరసించిన నలుగురు పేషెంట్స్​ను అంబులెన్స్​లో డాక్టర్లు జీజీహెచ్​కు షిఫ్ట్​ చేశారు. 20 మందికి అక్కడే ట్రీట్ మెంట్​ అందిస్తున్నారు. ఎంపీడీవో రాములు, ఎంపీవో కిరణ్​ తదితరులు 
ఉన్నారు. 

హాస్టల్​ తనిఖీ..

కంజర రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ కమ్ హాస్టల్​ను కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సోమవారం తనిఖీ చేశారు. భోజనాలు ఎలా అందిస్తున్నారని స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్​కు సూచించారు. వంట సరుకులు, డైనింగ్ హాల్ పరిశీలించారు. పరిశుభ్రత పాటించాలని, రెగ్యులర్​గా స్టూడెంట్స్రోకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.