నిజామాబాద్ జిల్లాను ఐఎస్ఐకి అడ్డాగా చేసిన్రు

నిజామాబాద్ జిల్లాను ఐఎస్ఐకి అడ్డాగా చేసిన్రు

బాన్సువాడలో టీఆర్ఎస్ పార్టీని కూలదోయటనికి యూపీ నుండి బుల్డోజర్ తెప్పిస్తమని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి లో బీజేపీ పార్టీ కార్యాలయంను ఎమ్మెల్యే రాజాసింగ్, నియోజక వర్గఇన్ చార్జి మాల్యాద్రి రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.

బాన్సువాడ నియోజకవర్గంను స్పీకర్ రెండుగా విభజించి ఇద్దరి కొడుకులకు పంచారని రాజాసింగ్ ఆరోపించారు. ఇక్కడ ఇసుక మాఫియా కొనసాగుతుందన్న ఆయన.. నిజామాబాద్ జిల్లాను ఐఎస్ఐకి అడ్డాగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎఫ్ఐ సభ్యులు నిజామాబాద్ అడ్డాగా 200 మందికు ట్రైనింగ్ ఇచ్చి హిందువుల పై దాడికి కుట్రలు పన్నుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఈ కుట్రలను బీజేపీ తిప్పి కొడుతుందని స్పష్టం చేశారు.