ఆర్మూర్, వెలుగు : ఈ నెల20 న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్లో జరుగనున్న రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల అండర్ 19 బాలికల కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికైంది. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా జట్టును బుధవారం ఆర్మూర్ లో ఎంపిక చేశారు.
ఆర్మూర్లోని మిని స్టేడియంలో ఎంపిక పోటీలు నిర్వహించి జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్స్ చిన్నయ్య, అంజు, కొంతం పూర్ణ , సీనియర్ హాకీ క్రీడాకారులు కత్తి శీను, వెంకటేశ్తదితరులు పాల్గొన్నారు.
