
బాల్కొండ, వెలుగు : ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగే అండర్ 18 బాల, బాలికల నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్కు జిల్లా క్రీడాకారిణి మేఘన ఎంపికైందని జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ అంద్యాల లింగయ్య, జనరల్ సెక్రటరీ కె.గంగాధర్ బుధవారం తెలిపారు. ఈ నెల 11 నుంచి 24 వరకు బాచుపల్లి కబడ్డీ అకాడమీలోని శిక్షణ శిబిరంలో ప్రతిభను చూపిన మేఘన నేషనల్ జట్టులో స్థానం పొందింది.
ఈ నెల 28 నుంచి జూలై 1వరకు జరిగే నేషనల్ కబడ్డీలో పాల్గొననుంది. మేఘన ను ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్ రెడ్డికి జిల్లా కబడ్డీ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.