మోదీతోనే అవినీతి రహిత పాలన : అర్వింద్

మోదీతోనే అవినీతి రహిత పాలన : అర్వింద్

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రైతులు మోసపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ది జరగలేదన్నారు. అవినీతి లేని చోటే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. 

మోదీ నేతృత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన సాగుతోందన్నారు అర్వింద్. బీజేపీకి ఓటేసి మరోసారి మోదీని ప్రధానిని చేయాలన్నారు.పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్వింద్.