నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్పరిధిలో రెండు వారాలపాటు నిర్వహించిన డ్రంకెడ్ డ్రైవ్లో 471 కేసులు నమోదు చేశామని సీపీ సాయిచైతన్య తెలిపారు. ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి రూ.43.30 లక్షల జరిమానాలు విధించారని తెలిపారు.
ఇందులో 38 మందికి వారం రోజుల జైలు శిక్ష కూడా విధిస్తూ తీర్పు చెప్పారన్నారు. లోక్అదాలత్లో 5,662 కేసుల మధ్య పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చామని పేర్కొన్నారు. సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు రూ.31.82 లక్షలు రికవరీ చేసి ఇప్పించామన్నారు.
