రౌడీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్తం : శ్రీశైలం గౌడ్

రౌడీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్తం : శ్రీశైలం గౌడ్
  •     కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ 

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రౌడీయిజాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసి తగిన బుద్ధి చెప్తమని కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ను ఆగం చేశాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, బీజేపీ గెలుపు తథ్యమని, పార్టీ కోసం కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం బాచుపల్లి జేకే గార్డెన్ లో జరిగింది. ముఖ్య అతిథిగా గోవా బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సదానంద్ తన్వాడే , పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి పాల్గొనగా..

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ  అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ'మన్ కీ బాత్'ను పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్​ ,  పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి , పార్లమెంట్ కో కన్వీనర్ రాజు, సులోచన, సుమన్ రావు, అమలేశ్వరి, రామచంద్ర నాయక్, ప్రొ.చంద్రమౌళి, భిక్షపతి, సుహాసిని, ప్రదీప్, వివిధ మోర్చాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.