
హైదరాబాద్ సిటీ, వెలుగు: పదేండ్ల కింద ఇండియాకు మెడికల్వీసాపై వచ్చి, గడువు ముగిసినా హైదరాబాద్లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ను పట్టుకొని డిపోర్ట్ చేసినట్టు హెచ్న్యూ డీసీపీ సుదీంద్ర గురువారం తెలిపారు. నైజీరియాకు చెందిన ఒనురా సోలమన్ 2014లో మెడికల్ వీసాపై ఇండియా వచ్చాడు. అతని వీసా 2014 సెప్టెంబర్ 23న, పాస్పోర్ట్ 2016 జనవరి 16న గడువు ముగిసింది. అయినప్పటికీ అతను చట్టవిరుద్ధంగా అత్తాపూర్లో ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు.
పూణే , ముంబై నుంచి గంజాయి, డ్రగ్స్ తెచ్చి సిటీలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడు. ఇటీవల అతను టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా.. హెచ్న్యూ పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్టు చేశారు. విచారణలో అతను సరైన డాక్యుమెంట్లు చూపించలేదు. పైగా వీసా, పాస్పోర్ట్ గడువు ముగిసినట్లు అంగీకరించాడు .దీంతో పోలీసులు అతడిని అక్టోబర్ 9 ఉదయం నైజీరియాకు డిపోర్ట్ చేశారు.