తెలంగాణలో ఏ పార్టీతో పొత్తులుండవు : చంద్రబాబు

తెలంగాణలో ఏ పార్టీతో  పొత్తులుండవు :  చంద్రబాబు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణలో ఏ పార్టీతో పొత్తులు లేవని ఒంటరిగానే టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలతో సోమవారం హైదరాబాద్​లోని తన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ నిర్వహించనున్న బస్సు యాత్ర, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై చంద్రబాబుకు.. కాసాని వివరించారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీతో తెలంగాణలో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదని ఒంటరిగానే బరిలో దిగేందుకు సిద్ధపడాలన్నారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్ని.. దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని సూచించారు. 119 స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు.