
గందరగోళంలో కేయూ ఎస్డీఎల్ సీఈ స్టూడెంట్లు
8 నుంచి కేవలం ఫైనల్ ఇయర్వాళ్లకే ఎగ్జామ్స్
ఫస్ట్, సెకండ్ ఇయర్కు పోస్ట్పోన్ ఆఫీసర్ల తీరుతో
సఫర్ అవుతున్న స్టూడెంట్లు
వరంగల్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ ఎస్డీఎల్సీఈ(స్కూల్ ఆఫ్డిస్టెన్స్లెర్నింగ్అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్) పరీక్షల నిర్వహణ అంతా గందరగోళంగా మారింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్స్కండక్ట్ చేయాల్సిన ఆఫీసర్లు అయోమయం సృష్టిస్తుండటంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే రెండుసార్లు పరీక్షలను వాయిదా వేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 8 నుంచి కేవలం ఫైనల్ఇయర్స్టూడెంట్స్కు మాత్రమే ఎగ్జామ్స్ పెట్టేందుకు ఆఫీసర్లు సిద్ధమయ్యారు. ఫస్ట్, సెకండ్ఇయర్స్టూడెంట్లకు పరీక్షలు మళ్లీ పోస్ట్ పోన్ చేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు.
ఏడాదిగా వాయిదాలే..
ఎస్డీఎల్ సీఈలో 2018–-19 అకడమిక్ ఇయర్లో యూజీసీ రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు చేశారనే కారణంతో ఎగ్జామ్స్పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. వారంతా ఇప్పటికే ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. ఆ తరువాత బ్యాచ్లలో అడ్మిషన్లు చేపట్టగా.. దాని ప్రకారం ఎస్డీఎల్సీఈలో దాదాపు 40వేల మంది స్టూడెంట్లు ఉన్నారు. వీరికి గత మార్చిలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్జరగాల్సి ఉండగా.. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఫస్ట్, సెకండ్ఇయర్ స్టూడెంట్లు విద్యా సంవత్సరం లాస్ కావద్దనే ఉద్దేశంతో పై తరగతులకు ప్రమోట్చేశారు. ఈ మేరకు ప్రమోట్అయిన స్టూడెంట్లు రెండు నెలల తేడాతో రెండు సంవత్సరాల ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. 2020 డిసెంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్లాన్చేసినప్పటికీ వివిధ కారణాలతో జనవరి 20 నుంచి పరీక్షలు పెట్టేందుకు టైం టేబుల్రిలీజ్చేశారు. కానీ ఎగ్జామ్ సెంటర్ల విషయం క్లారిటీ రాకపోవడంతో ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు. అదీ కేవలం డిగ్రీ, పీజీ ఫైనల్ఇయర్స్టూడెంట్స్కు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఫస్ట్, సెకండ్ఇయర్ స్టూడెంట్లకు ఏడాదికాలంగా ఎదురుచూపులే దిక్కవుతున్నాయి. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అంతా గందరగోళంలో పడ్డారు.
చివరి నిమిషంలో హడావుడి
ఫిబ్రవరి 8 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. 7న సండే కావడంతో శనివారమే హాల్టికెట్ల కోసం స్టూడెంట్లు మొబైల్లో వెతకడం, మీ సేవా కేంద్రాలను సంప్రదించడం చేశారు. కానీ అప్డేట్సమాచారం ఏమీ లేకపోవడంతో హైదరాబాద్, నల్గొండ, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఆఫీస్లో సంప్రదించడం ప్రారంభించారు. ఒక్కొక్కరిగా ఆఫీస్కు వస్తున్న వారి సంఖ్య
పెరిగిపోవడంతో ఆఫీసర్లు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హడావుడిగా ఫస్ట్, సెకండ్ఇయర్పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు స్టూడెంట్ల ఫోన్లకు మెసేజ్ పంపించారు. ఇక ఫైనల్
ఇయర్హాల్ టికెట్లను మధ్యాహ్నం 3 గంటల టైంలో
అప్ లోడ్ చేశారు. ఎస్డీఎల్సీఈ, కేయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ మధ్య సమన్వయం లేకనే ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కడెక్కడో సెంటర్లు
కేయూ ఎస్డీఎల్సీఈ పరిధిలో 2019–-20 విద్యా సంవత్సరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా160 స్టడీ సెంటర్లు ఉండేవి. కానీ 2020–-21 విద్యా సంవత్సరం నుంచి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 110 ఎత్తేసి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేవలం 50 స్టడీ సెంటర్లు మాత్రమే కొనసాగిస్తున్నారు. ఫైనల్ఇయర్స్టూడెంట్లకు స్టడీ సెంటర్ల నుంచి 50 కిలో మీటర్ల పరిధిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ మేరకు గతంలో ఉండే 110 సెంటర్లను ఇప్పుడు 30 కుదించారు. దీంతో చాలామంది స్టూడెంట్లకు దూరాభారం ఎక్కువైంది. శనివారం సాయంత్రం హాల్ టికెట్లు ఇష్యూ చేయగా.. వనపర్తి జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్కు ఖమ్మం జిల్లాలో సెంటర్ వేశారు. దీంతో దాదాపు 250 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆ స్టూడెంట్ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అప్పటికప్పుడు మళ్లీ సెంటర్ మార్చే ప్రయత్నాలు చేపట్టారు. హైదరాబాద్లో ఉండే స్టూడెంట్కు జనగామలో సెంటర్ వేశారు. ఎలాంటి ప్లాన్లేకుండా చివరి నిమిషంలో హాల్ టికెట్లు ఇష్యూ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెంటర్ దూరం వేసిన్రు
హైదరాబాద్లో ఉంటూ డిస్టెన్స్లో డిగ్రీ చదువుతున్నా. ఇప్పుడు నాకు జనగామలో సెంటర్ వేశారు. భువనగిరిలోనే సెంటర్ ఉన్నా అక్కడ వేయకుండా చాలా దూరం వేశారు. దీనిపై అభ్యంతరం కూడా చెప్పే వీలు లేకుండా శనివారం సాయంత్రం సెంటర్లు డిక్లేర్చేసి హాల్టికెట్లు ఇష్యూ చేశారు. మాలాంటి వాళ్లకు దగ్గర్లోని సెంటర్లు కేటాయిస్తే పరీక్షకు హాజరయ్యేందుకు అనుకూలంగా ఉంటుంది.
– జివిలికపల్లి వెంకటేశ్, భువనగిరి
మళ్లీ ఎప్పుడో చెప్పడం లేదు
మా బాబు ఎస్డీఎల్సీఈలో డిగ్రీ ఫస్ట్ ఇయర్చదువు తున్నాడు. ఎగ్జామ్స్పోస్ట్ పోన్అయినప్పుడు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. యూనివర్సిటీ సైట్లో కూడా ఎలాంటి సమాచారం లేక పరీక్ష దగ్గర పడుతోందని శనివారం ఉదయం నేరుగా ఆఫీస్కు వచ్చాను. ఇక్కడి ఆఫీసర్లు డిగ్రీ ఫస్ట్ఇయర్, సెకండ్ఇయర్పరీక్షలు వాయిదా వేసినట్లు చెప్పారు. కానీ మళ్లీ ఎప్పుడు పెడతారో చెప్పడం లేదు. ఇప్పటికే మూడుసార్లు హైదరాబాద్ నుంచి వచ్చా. ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల సమయంతో పాటు ఛార్జీలు లాస్ కావాల్సి వస్తోంది.
- శామ్యూల్, స్టూడెంట్ తండ్రి, హైదరాబాద్
త్వరలోనే మిగతా వాళ్లకూ ఎగ్జామ్స్
2018–-19 బ్యాచ్ స్టూడెంట్లకు వీసీ అనుమతితో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కండక్ట్చేస్తున్నాం. వీరికి బ్యాక్లాగ్స్ రాసే అవకాశం కూడా కల్పించాం. ఆ తరువాత ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేస్తాం. త్వరలోనే ఎగ్జామ్స్ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఎగ్జామ్ సెంటర్లు 50 కిలోమీటర్ల పరిధిలోపు కేటాయించాం. దగ్గర్లో సెంటర్లు లేనివారికి మాత్రమే కొంచెం దూరంలో వేయాల్సి వచ్చింది. – మహేందర్రెడ్డి, కేయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్