కోరల్ గేబుల్స్ (ఫ్లోరిడా): సాకర్ వరల్డ్ కప్ ఫ్యాన్స్కు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ఊహించని షాకిచ్చింది. టోర్నీ జరిగే 16 స్టేడియాల్లో రీఫిల్లబుల్ వాటర్ బాటిళ్లను తీసుకురావడాన్ని నిషేధిస్తూ చివరి నిమిషంలో రూల్స్ను సవరించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఈ సమయంలో ఫిఫా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఫ్యాన్స్ నుంచి డబ్బులు గుంజడానికే ఈ కొత్త రూల్ను తీసుకొచ్చారని కొన్ని అసోసియేషన్లు ధ్వజమెత్తాయి. తీవ్రమైన ఎండలు, వాతావరణ మార్పులు చూపే అవకాశం ఉన్న టోర్నీలో ఇలాంటి నిర్ణయం సరైంది కాదని పేర్కొంది. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రపంచకప్ వైట్హౌస్ టాస్క్ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గియులియాని వెల్లడించారు.
