- ముందైతే వేయం మున్ముందు చెప్పలేం
- అణుబాంబుల ప్రయోగంపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్సింగ్
అణుబాంబులున్న శక్తివంతమైన దేశంగా ఇండియాను మార్చాలన్న అటల్ ఆశయానికి పోఖ్రానే సాక్ష్యం. అణుబాంబులు ముం దుగా ప్రయోగించరాదన్న రూల్ కి మన దేశం ఇప్పటికీ కట్టు బడే ఉంది. భవిష్యత్తులో ఏం చేస్తామన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
జైపూర్/న్యూఢిల్లీ: ‘‘శత్రుదేశాలపై ముందుగా అణుబాంబులు ప్రయోగించరాదన్నది ఇండియా పాలసీ. ఈ పాలసీకి ప్రస్తుతానికి ఇండియా కట్టుబడే ఉంది. భవిష్యత్తులో మాత్రం అప్పటి పరిస్థితిని బట్టి ఈ పాలసీ మారిపోవచ్చు” అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్అన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు1998లో న్యూక్లియర్ ప్రయోగాలు జరిపిన పోఖ్రాన్ ను రాజ్నాథ్ శుక్రవారం సందర్శించారు. అటల్ బిహారీ వాజ్పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్లో జరిగిన కార్యక్రమంలో డిఫెన్స్ మంత్రి పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘అణుబాంబులున్న శక్తిమంతమైన దేశంగా ఇండియాను మార్చాలన్న అటల్జీ ఆశయానికి పోఖ్రాన్ ఒక సజీవ సాక్ష్యం. అణు ఆయుధాలను ముందుగా ఉపయోగించబోమన్న రూల్కి ఇండియా కట్టుబడి ఉంది. అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మాత్రం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని పోఖ్రాన్ నుంచి తిరిగివచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. అయితే, 2016లోనూ అప్పటి మోడీ ప్రభుత్వంలోని డిఫెన్స్మినిస్టర్మనోహర్పరీకర్కూడా ఇండియా అణుపాలసీపై ఇలాంటి కామెంట్లే చేశారు. అసలు ఇండియాకు ఇలాంటి పాలసీ అవసరమా? అని ఆయన ప్రశ్నించడం సంచలనం రేపింది.