చాలాచోట్ల నో మాస్క్..పట్టించుకోని అధికారులు

చాలాచోట్ల నో మాస్క్..పట్టించుకోని అధికారులు

కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అయితే కరోనా జాగ్రత్తలు పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను జనం పాటించడం లేదు. ఆదివారం కావడంతో కూరగాయలు కొనడానికి రైతు బజార్లకు వెళ్లిన చాలా మంది మాస్కులు పెట్టుకోలేదు. అధికారులు కూడా పట్టించుకోలేదు. మార్కెట్లలో రద్దీ, కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.