ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు : వైఎస్ షర్మిల

ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు : వైఎస్ షర్మిల

హాస్పిటల్​కు తరలించిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: తన పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టిన వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల దీక్ష ను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణించ డంతో జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్​కు తరలించారు. షర్మిలను ఆమె తల్లి విజయమ్మ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లో బీపీ, బలహీనత, మత్తు ఉండటంతో అడ్మిట్ అయ్యారని, డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని డాక్డర్లు తెలిపారు. చికిత్స కొనసాగుతున్నదని, త్వరలో డిశ్చార్జ్​ చేస్తామని, రెండు మూడు వారాలు రెస్ట్ అవసరమన్నారు.

నన్ను బంధించడం కేసీఆర్ తరం కాదు: షర్మిల

ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని షర్మిల అన్నారు. వైఎస్సార్​ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ టీపీని ఏర్పాటు చేశామని చెప్పారు. పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా పోలీసుల భుజాన గన్ పెట్టి పాదయా త్రను టార్గెట్ చేసి, పర్మిషన్ ఇవ్వకుండా చేశా రని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. తనను బంధిం చడం కేసీఆర్​ తరం కాదని హెచ్చరించారు.