బెదిరేది లేదు..ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే మొదలు పెడ్త

బెదిరేది లేదు..ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే మొదలు పెడ్త

పాదయాత్రకు భద్రత కల్పించాలని అడిషనల్ డీజీపీకి వైఎస్ఆర్టీపీ చీఫీ షర్మిల వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మి,ల... రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తల్లా వాడుకున్నారన్న ఆమె... డిసెంబర్ 4 తేదీ నుంచి14 వరకు మళ్లీ తమ పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అదే చోటు నుంచి మళ్లీ పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 

పోలీసులకు లా అండ్ ఆర్డర్ ఫాలో కావాల్సిన అవసరముందన్న షర్మిల.. మళ్లీ వాళ్లకు వాళ్ల బాధ్యతలను గుర్తు చేస్తున్నామన్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చెప్పారు. ఇది తాలిబన్ల రాజ్యం సాగుతుందనడానికి ఏమాత్రం సంకోచం లేదన్నారు. టీఆర్ఎస్ నాయకులంటే నాయకుల ముసుగులో ఉన్న గూండాలని ఆరోపించారు. ఈ తాలిబన్ మాటలకు మేం బెదరమని తేల్చి చెప్పారు.  ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరన్న ఆమె... పాదయాత్రనే కాదు వైఎస్ఆర్ పార్టీని కూడా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.