ఎల్‌ఐసీకి ఆదేశాలు ఇవ్వలేదు: అదానీ గ్రూప్‌‌లో పెట్టుబడులపై నిర్మలా సీతారామన్ వివరణ

ఎల్‌ఐసీకి ఆదేశాలు ఇవ్వలేదు: అదానీ గ్రూప్‌‌లో పెట్టుబడులపై నిర్మలా సీతారామన్ వివరణ

న్యూఢిల్లీ: అదానీ గ్రూపులో ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడి కోసం తమ మంత్రిత్వ శాఖ సలహాలు, ఆదేశాలు ఇవ్వదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‌‌‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.  స్టాండర్డ్​ ఆపరేటింగ్ ​ప్రొసీజర్స్​(ఎస్​ఓపీలు) ప్రకారమే అవి జరిగాయని స్పష్టం చేశారు. 

ఎల్‌‌‌‌ఐసీ నిర్ణయాలు ఇన్సూరెన్స్ చట్టం, ఐఆర్‌‌‌‌డీఏఐ, ఆర్‌‌‌‌బీఐ, సెబీ నిబంధనల ప్రకారం ఉంటాయని మంత్రి తెలిపారు. ఎల్ఐసీ ఈ ఏడాది మేలో అదానీ పోర్ట్స్‌‌లో  రూ.ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టింది.  ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నిఫ్టీ–50 కంపెనీలలో పెట్టుబడి బుక్ వాల్యూ రూ.4,30,776.97 కోట్లుగా ఉంది. రిలయన్స్​లో రూ.40,901.38 కోట్లు ఇన్వెస్ట్​ చేసింది.