గ్రహణం రోజు శ్రీకాళహస్తి తెరిచే ఉంటుంది

గ్రహణం రోజు శ్రీకాళహస్తి తెరిచే ఉంటుంది

సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చాయంటే ఆలయాలు మూసివేయడం అనాయితీగా కొనసాగుతోంది. కానీ శ్రీకాళహస్తి టెంపుల్ లో వాయులింగేశ్వర స్వామి పూజలు కొనసాగుతున్నాయి. పంచభూత లింగాలుగా మహాశివుడు భూమిపై అవతరించాడని హిందూ పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. కంచీపురం, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై, చిదంబరం, శ్రీకాళహస్తీ ప్రాంతాల్లో పంచభూత లింగాలకు ఆలయాలు ఉన్నాయి. అయితే వీటిలో భూ, జల, ఆకాశ, అగ్ని ప్రతీకలు ఉన్న ఆలయాలన్నింటిని సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో మూసివేసి, పరిసమాప్తి తర్వాత శుద్ధి, ఆచమనం నిర్వహించడం ఆనవాయితీ. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో పంచభూత ఆలయాల్లో నాలుగింటిని మూసివేసి కేవలం వాయులింగేశ్వరుడికి మాత్రమే అభిషేకాలను నిర్వహిస్తారు. 

సూర్యగ్రహణం కారణంగా ఏపీలో మహానంది ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. రేపు ఉదయం వరకు టెంపుల్ క్లోజ్ ఉండనుంది. ఆలయంలో సంప్రోక్షణ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం సందర్భంగా ఆర్జీత సేవలు రద్దు చేశారు. ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:29 గంటలకు గ్రహణం ముగియనుంది. దాదాపు 1:30 గంటల పాటు ఇది కొనసాగనుంది. ఈ సమయంలో సూర్యుడు 43 శాతం అస్పష్టంగా కనిపించనున్నాడు. సూర్య గ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.