
కుభీర్, వెలుగు: స్కూల్లో చదువు చెప్పేందుకు టీచర్లు లేకపోతే, ఎవరూ చెబుతారంటూ..? పేరెంట్స్ ఆందోళనకు దిగారు. నిర్మల్జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1– 6 తరగతులు కొనసాగుతున్నాయి. సుమారు 58 మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. స్కూల్స్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా హెడ్మాస్టర్మాత్రమే ఉండగా, మిగతా టీచర్లు లేరు. ఉన్నాతాధికారులు ఇంకెవరినీ నియమించలేదు.
దీంతో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బుధవారం స్కూల్ కు తాళం వేసి నిరసన చేపట్టారు. టీచర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో స్కూల్ లో టీచర్ల నియామకంపై పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వెంటనే టీచర్లను నియమించకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. సమాచారం అందడంతో ఎంఈవో విజయ్కుమార్ స్కూల్ ను సందర్శించి టీచర్లను నియమిస్తామని హామీచ్చారు.