90% పేరెంట్స్ది ఇదే ఒపీనియన్“ఆన్లైన్ క్లాసులతో పిల్లలు నేర్చుకునేది తక్కువ, మాపైనే ఎక్కువ బర్డెన్ పడుతోంది. వీడియో క్లాసెస్ యూజ్ఫుల్గా లేవు. అదేపనిగా గ్యాడ్జెట్స్ చూస్తుండడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి’’ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సర్వేలో పేరెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది.
లాక్డౌన్లో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ తీరు, ఆన్లైన్ క్లాసులు, స్కూల్స్ రీ ఓపెన్ తదితర అంశాలపై సిటీలో ఈ సర్వే చేశారు.
హైదరాబాద్, వెలుగు: స్కూల్కి వెళ్తే ట్యూషన్, ట్రాన్స్ పోర్టేషన్, లైబ్రరీ, మెస్, యాన్యువల్, ఆక్టివిటీస్, టర్మ్.. ఇలా పలు రకాల ఫీజులను మేనేజ్మెంట్స్ వసూలు చేస్తాయి. కరోనా ఎఫెక్ట్తో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మాత్రమే చెప్తున్నారు. టీచర్స్ చెప్తున్న దానికే ట్యూషన్ ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. కిందటేడు ఫీజులే కంటిన్యూ చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూల్స్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ట్యూషన్ ఫీజుతో పాటు అన్నీ పే చేయాలంటున్నాయని హెచ్ఎస్పీఏ సర్వేలో పేరెంట్స్ తెలిపారు.
యూజ్ ఉందా అంటే…
టీచర్లు పిల్లలకు ఇచ్చే అసైన్మెంట్స్ బాధ్యతను పేరెంట్స్ పైనే వేస్తున్నారు. క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, హోమ్ వర్క్ చేయించే వరకు తల్లిదండ్రులే అన్నీ చూసుకుని టీచర్స్ కి మెయిల్, వాట్సాప్లో పంపిస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు చదువు నేర్చుకుంటున్నారని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు 90% మంది ఎలాంటి యూజ్ లేదని చెప్పారు.
స్కూల్స్ రీ ఓపెన్పై...
ఆగస్టులో స్కూల్స్ ఓపెన్ చేసే అవకాశాలున్నా, ఇలాంటి పరిస్థితుల్లో వద్దంటున్నారు పేరెంట్స్. స్కూల్స్ రీఓపెన్ పై ప్రశ్నించగా, డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది. జూన్లో ఓపెన్ చేయాలని 0.9%, జులైలో అని 5.5%, లాక్ డౌన్ ఎత్తేశాక అని 3.4%, గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమని 19.2%, వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాతే ఓపెన్ చేయాలని 82.9% మంది పేరెంట్స్ చెప్పారు.
స్కూల్ ముందు ఆందోళన
ఆన్లైన్ క్లాస్లు, ఫీజుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ హిమాయత్నగర్లోని వాసవీ పబ్లిక్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు. లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వేలకు వేల ఫీజులు ఎక్కడ్నుంచి తెచ్చి కడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నామని వాపోయారు. ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా, స్కూల్ మేనేజ్మెంట్ అన్ని ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. మొత్తం ఫీజులోని 50% ట్యూషన్ ఫీజును డబుల్చేసి, అంతా కట్టాలంటున్నారని ఓ పేరెంట్తెలిపారు.
ఎక్కువ మంది అసంతృప్తిలోనే..
గవర్నమెంట్రూల్స్ బ్రేక్ చేస్తూ ప్రైవేట్స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. పే చేస్తేనే క్లాసులు చెప్తామంటూ పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులపై తల్లిదండ్రులు అసలేం ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలని ఈ నెల ఫస్ట్ వీక్లో ఆన్లైన్ సర్వే చేశాం. 1,247 మంది పేరెంట్స్ రెస్పాండ్ అయ్యారు. ఎక్కువ శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే మరో సర్వే రిలీజ్ చేస్తాం.
‑ సీమా అగర్వాల్ ,
వైస్ ప్రెసిడెంట్, హెచ్ఎస్పీఏ