అమెజాన్‌‌కు నాన్-బెయిలబుల్ వారెంట్: ఐఫోన్ బదులు వేరే ఫోన్ పంపినందుకు కర్నూలు కన్స్యూమర్ ఫోరం చర్య

అమెజాన్‌‌కు నాన్-బెయిలబుల్ వారెంట్: ఐఫోన్ బదులు వేరే ఫోన్ పంపినందుకు కర్నూలు కన్స్యూమర్ ఫోరం చర్య

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: అమెజాన్ ఇండియాపై ఏపీ, కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేసిన కస్టమర్‌‌‌‌కు.. ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ పంపినందుకు అమెజాన్‌‌తో పాటు ఇద్దరు సెల్లర్లకు నాన్-బెయిలబుల్ వారెంట్(ఎన్​బీడబ్ల్యూ)  ఇష్యూ చేసింది.

ఫోరం ఆదేశాలను ధిక్కరించినందుకు వారెంట్లు ఇష్యూ చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూల్ జిల్లా బెలగల్ మండలం కూరువా స్ట్రీట్‌లో ఉండే కె. వీరేశ్.. గతేడాది సెప్టెంబర్ 2న అమెజాన్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్ ద్వారా ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్​ ఇచ్చి రూ. 79,900 చెల్లించాడు. కానీ, అతనికి ఐఫోన్​కు బదులు ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ వచ్చింది. దాంతో వీరేశ్ అమెజాన్​ను సంప్రదించి, రీఫండ్ లేదా రీప్లేస్‌‌‌‌మెంట్ ఇవ్వాలని కోరాడు. సెల్లర్ దీన్ని పట్టించుకోలేదు.

దీంతో వీరేశ్ కర్నూలులోని కన్స్యూమర్ ఫోరమ్​ను ఆశ్రయించాడు. అమెజాన్, సెల్లర్ ​కలిసి ఐఫోన్ 15 ప్లస్‌‌‌‌ను ఇవ్వాలని లేదా రూ.79,900కి 12 శాతం వడ్డీతో రీఫండ్ చేయాలని  ఈ ఏడాది జూన్ 16న ఫోరం ఆదేశాలిచ్చింది. కస్టమర్​ను మానసికంగా హింసించినందుకు రూ. 25 వేలు, కోర్టు ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని ఫోరం స్పష్టం చేసింది. అయినా..అమెజాన్​, సెల్లర్స్​ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో వీరేశ్​ ఆగస్టు 18న ఎగ్జిక్యూషన్  పిటిషన్ ​ఫైల్​చేశాడు. దీంతో కమిషన్ మరో నోటీస్​ ఇచ్చింది.