ఇద్దరు ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ 

ఇద్దరు ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ 

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్కు ప్రజా ప్రతినిధుల కోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2012లో నిర్మల్ లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది. ఈ నెల12న తీర్పు వెలువరించనుంది.

మరిన్ని వార్తల కోసం..

మళ్లీ మారిన జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్

ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత