పద్మారావునగర్, వెలుగు: గత పక్షం రోజులుగా నార్త్జోన్పరిధిలో జరిగిన సెల్ఫోన్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, దోపిడీ కేసులను ఛేదించినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్శనివారం తన ఆఫీస్లో వెల్లడించారు. మార్కెట్ పీఎస్పరిధిలో అక్టోబర్ 7న జరిగిన సెల్ఫోన్ స్నాచింగ్ కేసులో మాంచాల జనార్దన్, చెరక గౌతమ్ కుమార్ను12 గంటల్లో అరెస్ట్ చేసి, రియల్మీ మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు.
బేగంపేట పరిధిలో అక్టోబర్ 26న ఓ మహిళ మంగళసూత్రం స్నాచింగ్ చేసిన జొన్నలగడ్డ అశోక్, గంటెనపల్లి రమణయ్యను ఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే పట్టుకున్నారు. మహాంకాళి పీఎస్ పరిధిలో ఆటో డ్రైవర్పై కత్తితో దాడి చేసి ఆటో, ఫోన్ లాక్కెళ్లిన సయ్యద్ జుబైర్ అలీ, మహ్మద్ పాషా అనే ఇద్దరిని గంటన్నరలో మోగల్పుర వద్ద అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 మొబైల్స్, రూ.9.5 వేల నగదు,కత్తి, ట్యాబ్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లి పరిధిలో అక్టోబర్ 8న ఓ ఇంట్లో చోరీ చేసిన జంగలం చందన్, లక్ష్మిని సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు.
అక్టోబర్ 27న బోయిన్పల్లిలో ఓ మహిళ బ్యాగ్ మాయమైన ఘటనలో ఓ జువైనైల్ నిందితుడిని గుర్తించారు. మరో ఘటనలో నకిలీ పోలీస్గా నటించి జరిమానా వసూలు చేసిన మసూద్ ఖాన్ను అక్టోబర్ 28న అరెస్ట్ చేశారు. పాన్బజార్లో ఒకరి నుంచి మొబైల్ లాక్కెళ్లిన షేక్ జావీద్, షేక్ అరీఫ్ను పట్టుకున్నారు.
భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ
నార్త్జోన్లోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో బాధితులు పొగొట్టుకున్న, చోరీకి గురైన 118 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిని బాధితులకు శనివారం డీసీపీ రష్మి పెరుమాళ్ అందజేశారు.
