నార్వే చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్ రేసులో గుకేశ్

నార్వే చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్ రేసులో గుకేశ్

స్టావాంగర్ (నార్వే): ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్ రేసులో నిలిచాడు. గురువారం రాత్రి జరిగిన తొమ్మిదో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ప్లేయర్  40 ఎత్తుల్లో చైనాకు చెందిన వీ యిపై విజయం సాధించాడు. ఈ విక్టరీతో మరో రౌండ్ మాత్రమే మిగిలున్న టోర్నీలో తను 14.5 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  టైటిల్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఓటమి అంచుల్లో నిలిచిన దశలో  నుంచి అద్భుతంగా పుంజుకొని అమెరికాగ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. 

ప్రస్తుతం అతను15 పాయింట్లతో  టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. తెలంగాణ జీఎం ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆర్మగెడాన్ టై బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడించిన  హికారు నకమురా (అమెరికా) సైతం 13 పాయింట్లతో రేసులో నిలిచాడు. చివరి, పదో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరికా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాస్టర్ ఫాబియానో కరువానాతో,  కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్.. అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  తలపడతారు. మరోవైపు విమెన్స్ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్టార్  కోనేరు హంపి తొమ్మిదో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైనాకు చెందిన లీ టింగ్జీ చేతిలో ఓడింది దాంతో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాదాపుగా ఖాయం చేసుకునే గోల్డెన్ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేజార్చుకుంది.  హంపి ఇప్పుడు 13.5 పాయింట్లతో ఒకటి నుంచి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. ఇదే రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉక్రెయిన్ జీఎం అనా ముజిచుక్ వరల్డ్ ప్రపంచ చాంపియన్ జు వెంజున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనా)ను 15.5 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. ఆర్. వైశాలి.. స్పెయిన్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారా ఖాదెమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది.  చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హంపి జుతో తలపడనుండగా, ముజిచుక్ ఆర్. వైశాలితో ఆడుతుంది.