
స్టావాంగర్ (నార్వే): వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ నార్వే చెస్ టోర్నీలో వరుసగా రెండో విజయం అందుకున్నాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్లో అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాపై ఆర్మగెడాన్ టై-బ్రేక్లో థ్రిల్లింగ్ విజయం సాధించాడు. కానీ, తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్.. లెజెండరీ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సెన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు ప్రస్తుతం గుకేశ్, అర్జున్ చెరో 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
కార్ల్సెన్ 8 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలవగా.. కరువానా 7 పాయింట్లతో రెండో ప్లేస్లో ఉన్నాడు. మరోవైపు విమెన్స్ ఇండియా స్టార్ ప్లేయర్ కోనేరు హంపి నాలుగో రౌండ్లో వరల్డ్ చాంపియన్ జు వెంజున్ (చైనా) చేతిలో టై బ్రేక్లో ఓడిపోయింది. అయినా ఏడు పాయింట్లతో హంపి సంయుక్త ఆధిక్యంలో నిలిచింది. మరో ఇండియన్ ఆర్. వైశాలి టై-బ్రేక్లో ఉక్రెయిన్కు చెందిన అనా ముజిచుక్ను ఓడించింది.