
ఉప్పల్ క్రాస్రోడ్స్లో రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్కైవాక్ను చాలా మంది వినియోగించుకోవడం లేదు. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉన్నప్పటికీ పైకి ఎక్కడం లేదు. టైమ్ వేస్ట్ అవుతుందని డివైడర్లు, బారికేడ్లు దూకుతున్నారు.
ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెల్లో నుంచి దూరి వెళ్తున్నారు. ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు సైతం ప్రమాదకంగా రోడ్డు దాటుతున్నారు. – ఫొటోగ్రాఫర్, వెలుగు