సెప్టెంబర్ 16 కాదు.. సెప్టెంబర్ 23న ‘బ్రహ్మస్త్ర’

సెప్టెంబర్ 16 కాదు.. సెప్టెంబర్ 23న ‘బ్రహ్మస్త్ర’

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మస్త్ర’ మూవీ మిక్స్ డ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బాక్సాపీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ ను దాటింది. సినిమా డే ఈవెంట్ దాని కలెక్షన్లను మరింద పెంచుతుందని భావిస్తున్నారు. ఇప్పటికీ మూవీ చూడని వారు.. మల్టీప్లెక్స్ లో తక్కువ ధరకే సినిమాను వీక్షించొచ్చు. కేవలం రూ. 75 ధర చెల్లించి.. బ్రహ్మస్త్రను చూడొచ్చు. సెప్టెంబర్ 16న జరగాల్సి ఉంది. కానీ.. ఈ తేదీని సెప్టెంబర్ 23కి మార్చారు. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని మల్టీప్లెక్స్ లో రూ. 75 ధర చెల్లించి సినిమాను చూసే అవకాశం కల్పిస్తున్నట్లు MAI ట్విట్టర్ లో పోస్టు చేసింది.

4000 కంటే ఎక్కువ స్క్రీన్ లలో ప్రదర్శించబడనున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది. PVR, INOX, CINEPOUS, CARNIVAL, MIRAJ, CITYPRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE అనేక సినిమా స్క్రీన్‌లలో ‘బ్రహ్మస్త్ర’ మూవీని చూడొచ్చు. సెప్టెంబర్ 23 ఈవెంట్ కు ముందు వెబ్ సైట్ లలో డీల్స్, ఆఫర్ ల గురించి మరిన్ని వివరాలు పొందుపర్చనున్నారు. అయన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మస్త్ర సెప్టెంబర్ 09న విడుదలైంది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. 



టికెట్లు ఎందుకు తగ్గించారు ? 
కరోనా కారణంగా సినిమా రంగం వెలవెలబోయింది. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు మూసివేయడంతో భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. షూటింగ్ లు కొనసాగడం, థియేటర్లు తెరుచుకోవడం జరిగాయి. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్ల వైపుకు రావడానాకి వెనుకడుగు వేశారు. ఇప్పుడిప్పుడే సినిమా రంగం కళకళలాడుతోంది. భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లు సందడిగా మారాలని..ప్రేక్షకులు ఒకరోజు థియేటర్లలో గడిపేలా ప్రోత్సాహించేందుకు ఈ విధానం అవలింబిస్తున్నారు. సినీ ప్రేక్షకులకు MAI ఆహ్వానం చెబుతోంది. 



ఆన్ లైన్ లో బుక్ ఎలా చేసుకోవాలి ? 
సమీపంలో ఉన్న థియేటర్ వెబ్ సైట్ కు వెళ్లాలి. 
అనంతరం నగరాన్ని సెలక్ట్ చేసుకోవాలి. 
మీ ప్రాంతంలోని థియేటర్ ను ఎంచుకోవాలి.
సినిమా చూసై టైం ఎంచుకోవాలి. నగదు చెల్లించాలి.
BookMyShow, Paytm ఇతర థర్డ్ పార్టీల యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.