క్యునెట్ కేసులో సినీనటులు,క్రికెటర్లకు నోటీసులు

క్యునెట్ కేసులో సినీనటులు,క్రికెటర్లకు నోటీసులు

క్యునెట్ కేసులో కొంత మంది ప్రముఖులకు ఉచ్చు బిగుసుకుంటోంది.ఈ కేసుకు సంబంధించి 5వందల మందికి నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులతో పాటు క్రికెటర్స్..కొన్ని కంపెనీల సీఈఓలున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్,బోమని ఇరానీ తో పాటు హీరోయిన్ పూజ హెడ్గే, టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ కు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు కంపెనీ నుంచి లబ్ది పొందిన వారికి కూడా నోటీసులు జారీ చేశారు. వీరంతా వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని..లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు సైబరాబాద్ పోలీసులు.

క్యునెట్‌ పేరుతో చట్టవిరుద్ధంగా మనీ సర్క్యులేషన్‌ స్కీంను ప్రారంభించి వేల కోట్ల రూపాయిలు మోసగించిన కేసులో ఇప్పటికే ఫెరీరా తో పాటు 80 మందిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ఈ కుంభకోణంలో మోసపోయారు.