ఈ ఏడాది జూన్ 16 నుంచి 15 సెకన్ల లోపే యూపీఐ పేమెంట్

ఈ ఏడాది జూన్ 16 నుంచి 15 సెకన్ల లోపే యూపీఐ పేమెంట్

ఢిల్లీ: యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​(యూపీఐ) విధానం సూపర్​ ఫాస్ట్​గా మారనుంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) రెస్పాన్స్​ సమయాన్ని తగ్గించడం ద్వారా ఈ మార్పును తీసుకురానుంది.  డెబిట్,  క్రెడిట్ చెల్లింపుల కోసం ప్రస్తుతం ఉన్న 30 సెకన్ల సమయం 15 సెకన్లకు తగ్గుతుంది.

లావాదేవీల స్టేటస్​ను తెలుసుకోవడానికి,  విఫలమైన లావాదేవీల రివర్సల్ కోసం పట్టే సమయం కూడా 30 సెకన్ల నుండి 10 సెకన్లకు తగ్గుతుంది. అడ్రస్ వెరిఫికేషన్​ సమయాన్ని కూడా 15 సెకన్ల నుండి 10 సెకన్లకు కుదించారు. బ్యాంకులు,  చెల్లింపు సేవలందించే సంస్థలు (పీఎస్​పీలు) తమ వ్యవస్థలను ఈ కొత్త సమయాలకు అనుగుణంగా మార్చుకోవాలని ఎన్సీపీఐ సూచించింది.