సబితా కాన్వాయ్ ని అడ్డుకున్న  NSUI నాయకులు

సబితా కాన్వాయ్ ని అడ్డుకున్న  NSUI నాయకులు

మీర్‎పేట్ రహదారి పై ఉద్రిక్తత నెలకొంది.  టెట్ పరీక్షను వెంటనే వాయిదా వెయ్యాలని డిమాండ్ చేస్తూ  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ని  రంగారెడ్డి జిల్లా NSUI నాయకులు అడ్డుకున్నారు. మీర్‎పేట్ లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాని అందించే ప్రయత్నం చేశారు NSUI నాయకులు.. అయితే వారికి అవకాశం ఇవ్వకపోవడంతో మంత్రి కాన్వాయ్ కి అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.  రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్‎పేట్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు.