23 శాతం పెరిగిన ఎన్​టీపీసీ లాభం.. మొదటి క్వార్టర్​లో రూ.4,907 కోట్లు

23 శాతం పెరిగిన ఎన్​టీపీసీ లాభం.. మొదటి క్వార్టర్​లో  రూ.4,907 కోట్లు

న్యూఢిల్లీ: కరెంటు ఉత్పత్తి సంస్థ  ఎన్​టీపీసీ ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో కన్సాలిడేటెట్​పద్ధతిలో నికర లాభంలో 23 శాతం గ్రోత్ నమోదు చేసింది. గత ఏడాది జూన్​ క్వార్టర్​లో రూ.3,977.7 కోట్ల లాభం రాగా, ఈ ఏడాది జూన్​ క్వార్టర్​లో రూ.4,907 కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో కార్యకలాపాల ఆదాయం రూ.43,075.09 కోట్లుగా ఉంది. 

కంపెనీ క్రితం సంవత్సరం రూ.43,177.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జూన్ క్వార్టర్​లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390  కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ 20.72 శాతంగా ఉంది. అంతకు ముందు ఏడాది కాలంలో ఇది 17.67 శాతంగా ఉంది.  జూన్ క్వార్టర్​లో క్యాప్టివ్ మైన్స్- నుంచి 6.24 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.  గత ఏడాది ఇదే క్వార్టర్​లో 4.10 మిలియన్ మెట్రిక్ టన్నులతో పోలిస్తే 52.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.  మొత్తం ఇన్​స్టాల్డ్​కెపాసిటీ 57,038 మెగావాట్లకు చేరింది.