
న్యూఢిల్లీ: కరెంటు ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో కన్సాలిడేటెట్పద్ధతిలో నికర లాభంలో 23 శాతం గ్రోత్ నమోదు చేసింది. గత ఏడాది జూన్ క్వార్టర్లో రూ.3,977.7 కోట్ల లాభం రాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ.4,907 కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో కార్యకలాపాల ఆదాయం రూ.43,075.09 కోట్లుగా ఉంది.
కంపెనీ క్రితం సంవత్సరం రూ.43,177.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జూన్ క్వార్టర్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ 20.72 శాతంగా ఉంది. అంతకు ముందు ఏడాది కాలంలో ఇది 17.67 శాతంగా ఉంది. జూన్ క్వార్టర్లో క్యాప్టివ్ మైన్స్- నుంచి 6.24 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 4.10 మిలియన్ మెట్రిక్ టన్నులతో పోలిస్తే 52.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఇన్స్టాల్డ్కెపాసిటీ 57,038 మెగావాట్లకు చేరింది.