
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ లో కొనసాగుతున్న ఎస్టీపీల పనుల్లో వేగం పెంచి తుదిదశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఈడీ మాయాంక్ మిట్టల్తో కలిసి అంబర్పేట, అత్తాపూర్ ఎస్టీపీలను విజిట్చేశారు. మొదట అంబర్పేట ఎస్టీపీకి వెళ్లిన ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
తర్వాత అత్తాపూర్ ఎస్టీపీని సందర్శించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. మిగిలిన పనుల్ని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం సుజాత, ఎస్టీపీ ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.