జ్యోతినగర్,వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డ్ ను గెలుచుకున్నది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సునీల్ కుమార్కు శుక్రవారం ఈ ఆవార్డ్ను అందజేశారు.
దేశంలోనే అతి పెద్ద 100 మెగా వాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ స్థాపన, మియావాకి ఫారెస్ట్ ను పెంపొందించడం, ఇంధన సామర్థ్యాన్ని, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, సీఓటూ ఉద్గారాలను తగ్గించడంలో ఎన్టీపీసీ చేస్తున్న కృషిని ఐఓడీ సంస్థ అభినందించింది. గత నాలుగేళ్లలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ మూడు సార్లు గోల్డెన్ పికాక్ అవార్డ్ను గెలుచుకోవడం సంస్థ నిబద్దతకు నిదర్శనమంది.