
హైదరాబాద్సిటీ, వెలుగు: ఎన్టీఆర్ఘాట్లో హెచ్ఎండీఏ రిపేర్లు మొదలుపెట్టింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేశ్ఘాట్నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్ వద్ద కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.1.30 కోట్ల వ్యయంతో ఘాట్ను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పనులను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
మూడు రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు ఆధునీకరణ పనులు చేస్తున్నారు. త్వరలో రంగులు వేసి దెబ్బతిన్న రోడ్డును పునరుద్ధరించనున్నారు. హైదరాబాద్కు వచ్చే చాలా మంది ట్యాంక్బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్రోడ్డుతో పాటు ఎన్టీఆర్పార్కు, పక్కనున్న ఎన్టీఆర్ఘాట్ను కూడా విజిట్చేస్తారు. ఇందులోనే మాజీ సీఎం ఎన్టీఆర్సమాధి కూడా ఉంది.