ఎన్టీఆర్ ఘాట్ రిపేర్లు షురూ ..రూ.1.30 కోట్లు కేటాయించిన హెచ్ఎండీఏ

ఎన్టీఆర్ ఘాట్ రిపేర్లు షురూ ..రూ.1.30 కోట్లు కేటాయించిన హెచ్ఎండీఏ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఎన్టీఆర్​ఘాట్​లో హెచ్ఎండీఏ రిపేర్లు మొదలుపెట్టింది. ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేశ్​ఘాట్​నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్ వద్ద కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.1.30 కోట్ల వ్యయంతో ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పనులను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 

మూడు రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు  ఆధునీకరణ పనులు చేస్తున్నారు. త్వరలో రంగులు వేసి దెబ్బతిన్న రోడ్డును పునరుద్ధరించనున్నారు. హైదరాబాద్​కు వచ్చే చాలా మంది ట్యాంక్​బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్​రోడ్డుతో పాటు ఎన్టీఆర్​పార్కు, పక్కనున్న ఎన్టీఆర్​ఘాట్​ను కూడా విజిట్​చేస్తారు. ఇందులోనే మాజీ సీఎం ఎన్టీఆర్​సమాధి కూడా ఉంది.