
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ డైరెక్టన్ లో బాలయ్య హీరోగా నటించిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్ కానుండగా..ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది యూనిట్. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసిన యూనిట్ ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేసింది. ‘నా ప్రాణాలకు ప్రాణంగా.. నా బిడ్డలకు తల్లిగా.. నా సహ ధర్మచారిణిగా.. నీ అనుమతి కావాలి తారకం..ఇష్టమేనా’ అంటూ బాలకృష్ణ.. విద్యాబాలన్ తో చెబుతున్న డైలాగ్ తో ప్రోమో మొదలైంది. ఇందుకు విద్యాబాలన్ సమాధానంగా.. ‘నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా..’ అని చెప్పడం హైలైట్ గా నిలిచింది. ‘యన్టిఆర్’ బయోపిక్కు సంబంధించిన రెండో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు.