మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ కారు దగ్ధం..ఎన్టీఆర్ స్టేడియం పార్కింగ్ లో ఘటన

మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ కారు దగ్ధం..ఎన్టీఆర్ స్టేడియం పార్కింగ్ లో ఘటన

ముషీరాబాద్, వెలుగు: ఓ ఎలక్ట్రిక్​ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ వాహనం దగ్ధమైంది. ఆదివారం ఎన్టీఆర్​ స్టేడియంలో పార్క్​ చేసిన ఎలక్ట్రిక్‌ కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చి వాహనమంతా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కారులో ఎవరు లేకపోవడంతో ప్రాణానష్టం  జరుగలేదు.