
జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో 14 మంది అడిషనల్ కమిషనర్లు ఉండగా.. ప్రస్తుతం ఆరు మందికి కుదించారు. ఇటీవల ట్రాన్స్ఫర్ కారణంగా ముగ్గురు అడిషనల్ కమిషనర్లు బయటకి వెళ్ళారు. దీంతో ప్రస్తుతం కేవలం ఆరుగురికి అడిషనల్ కమిషనర్లుగా బాధ్యతలు ఇచ్చి.. మిగతా వారికి జాయింట్ కమీషనర్లుగా పోస్టింగ్స్ ఇచ్చారు.
ALSO READ | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇక నుంచి టిఫిన్ కూడా..
అడిషనల్ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. అడ్వర్టైజ్ మెంట్, రెవిన్యూ, ఐటీ విభాగాలకు అడిషనల్ కమిషనర్ గా IAS అధికారి అనురాగ్ జయంతి నియమితులయ్యారు. స్పోర్ట్స్, అర్బన్ బయో డైవర్సిటీ అడిషనల్ కమిషనర్ గా IFS అధికారి సుభద్ర దేవి బాధ్యతలు తీసుకున్నారు. శానిటేషన్, హెల్త్ అడిషనల్ కమిషనర్ గా రఘు ప్రసాద్ ను నియమించారు.
అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ అడిషనల్ కమిషనర్ గా పంకజ ను నియమించగా.. డిపార్ట్ మెంట్ అఫ్ ఎంక్వైరీస్ అడిషనల్ కమీషనర్ గా సరోజ నియమితులయ్యారు. అదే విధంగా ఎలక్షన్స్, ఎస్టేట్స్ అడిషనల్ కమిషనర్ గా అలివేలు మంగతాయారు కు బాధ్యతలు అప్పగించారు.