డిగ్రీలో మూడేండ్లకు 142 క్రెడిట్స్..ఫైనల్ ​చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 

డిగ్రీలో మూడేండ్లకు 142 క్రెడిట్స్..ఫైనల్ ​చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కోర్సుల్లో క్రెడిట్స్ సంఖ్యను మళ్లీ పెంచారు. పది రోజుల క్రితం 150 క్రెడిట్స్ నుంచి 124కు కుదిస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. తాజాగా ఆ సంఖ్యను మళ్లీ 142కు పెంచారు. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. గురువారం హైదరాబాద్ లో టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన యూనివర్సిటీ వీసీల సమావేశం జరిగింది. దీంట్లో డిగ్రీలో క్రెడిట్స్, సిలబస్ తగ్గింపుపై చర్చించారు.

అయితే, గతంలో నిర్ణయించినట్టు లాంగ్వేజీల్లో క్రెడిట్స్ తగ్గిస్తే.. పీజీ కోర్సుల్లో ఆయా లాంగ్వేజీల్లో చేరాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వీసీలు సమావేశంలో వివరించారు. దీంతో పాత విధానంలోనే లాంగ్వేజీలకు 20 క్రెడిట్స్ అమలు చేయాలని నిర్ణయించారు. చిన్నచిన్న మార్పులతో 2025–26 విద్యాసంవత్సరం నుంచి 142 క్రెడిట్స్ విధానం అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. మరోపక్క డిగ్రీ ఫస్టియర్ సిలబస్​లోనూ వివిధ సబ్జెక్టుల్లో 15శాతం నుంచి 20శాతం తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఈ సిలబస్ డేటాను అన్ని వర్సిటీలకు పంపించనున్నారు. ఇక నుంచి ఒకే సిలబస్ ను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.