చనిపోయినట్టు డ్రామా ఆడిండు.. పోలీసులకు దొరికిండు

చనిపోయినట్టు డ్రామా ఆడిండు.. పోలీసులకు దొరికిండు

శంషాబాద్, వెలుగు: ఆర్మీ మాజీ ఆఫీసర్ ను అంటూ ఓ మహిళ వద్ద 50 తులాల గోల్డ్ , రూ.8.50 లక్షల డబ్బు తీసుకుని మోసగించిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి లో ఉండే ఎం. ఆనంద వర్ధన్(39)మాజీ ఆర్మీ ఆఫీసర్ నని, ఐబీ డిపార్ట్ మెంట్ లో అండర్ కవర్
ఏజెంట్ గా పనిచేస్తున్నానని మహిళను నమ్మించాడు. తనకు పెళ్లైనా భార్య వదిలేసిందని ఆమెను నమ్మించాడు. బంగారం, డబ్బులు వసూలు చేసి ఎంజాయ్ చేశాడు. ఆమె డబ్బులు అడిగేసరికి తను చనిపోయినట్లు ఇద్దరు వ్యక్తులను పంపించి బాధిత మహిళకు చెప్పించాడు. అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు కంప్లయింట్ చేయటంతో అసలు విషయం తెలిసింది. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.