వెంకటేష్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై పాతికేళ్లవుతోంది. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ సక్సెస్ అందుకుంది.
జనవరి 1న ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నిర్మాత రవికిషోర్, రచయిత త్రివిక్రమ్ ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. పాతికేళ్లు వెనక్కు వెళ్లి ఆ విశేషాల్ని గుర్తు చేసుకోవడం నోస్టాల్జిక్గా ఉందని, వెంకటేష్ ఆ పాత్రను ఎంతో ఓన్ చేసుకుని నటించారని త్రివిక్రమ్ అన్నారు. ఈ జనరేషన్ పిల్లల్ని కూడా ఎంటర్టైన్ చేస్తున్న ఇలాంటి సినిమాకు నిర్మాత అని చెప్పుకోవడం గౌరవంగా ఉందని రవికిషోర్ చెప్పారు.
